Ameerpet News: అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్‌ రగడ

Clashes Between BJP And TRS Activists In Ameerpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమీర్‌పేట ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్‌ రగడ రాజుకుంది. ప్రోటోకాల్‌ విషయంలో బీజేపీ -టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్పొరేటర్‌- మాజీ కార్పొరేటర్‌ అనుచరులు బాహాబాహీకి దిగారు. పోలీసులు సర్దిచెప్పినా గొడవ సద్దుమణగలేదు. ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన శిలా ఫలకంమీద పోట్రోకాల్‌ ప్రకారం కిషన్‌రెడ్డి పేరు ముందు వరుసలో లేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్‌ఎస్‌,బీజేపీ కార్యకర్తల పరస్పర నినాదాలతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది.


చదవండి:
న్యూడ్‌ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top