పెద్దపల్లిరూరల్: నైపుణ్యాలు పెంచుకునే అవకాశాలను బీఆర్ అంబేడ్కర్ ఓపెన్యూనివర్సి టీ ద్వా రా అందిస్తున్నామని డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో ప్రవేశ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. డి గ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నా రు. ఆగస్టు 7 ఆఖరు గడువుగా ఉందని తెలిపారు. ఇప్పటికే చేరి ద్వితీయ, ఫైనలియర్ చదివే విద్యార్థులు ఆగస్టు 7లోగా ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నా రు. ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య తదితరులున్నారు.


