అందరూ సుభిక్షంగా ఉండాలి
పెద్దపల్లిరూరల్: విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లావాసులు అందరూ సుభిక్షంగా ఉండాలని ఎ మ్మెల్యే విజయరమణారావు ఆకాంక్షించారు. స్థానిక ప్రగతినగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా అర్చకు డు కొండపాక శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవ ణం చేశారు. ప్రగతినగర్లో రెసిడెంట్ టీచర్స్ ఏ ర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అమర్నగర్ ప్రాంతంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మైనార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.


