విధి నిర్వహణలోనూ వైశాలిది ప్రత్యేకమైన శైలి. ముందు సమస్య వింటారు.. ఆ తర్వాత పరిష్కారం గురించి మాట్లాడతారు. ప్రజలకు ఒక అధికారి కనిపించకుండా.. తమ సమస్యను వినే ఒక మనిషి కనిపించేలా తన వ్యవహారశైలి ఉంటుంది. తన ప్రసంగంలోనూ చదువు విలువ చెబుతూ, కెరియర్ ఎంత ముఖ్యమో వివరిస్తూ స్ఫూర్తిని రగిలిస్తారు. ఆమె చుట్టూ ఉన్నవారు చెప్పే మాట ఒక్కటే.. ‘మ్మగారిలో అధికారం కనిపిస్తుంది.. అధికార దర్పం కనిపించదు.’ ఉద్యోగులతోనైనా, ప్రజలతోనైనా, సమస్యలతో వచ్చిన వారితోనైనా జేసీ మాట్లాడే తీరు అదే చెబుతుంది.


