కనీస వేతనాలు అమలు చేయాలి
చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, పేకాట క్లబ్లు, మద్యం సిండికేట్లతో కూటమి నాయకులకు మాత్రమే చంద్రబాబు సంపద అందించారు. సామాన్య ప్రజలను నట్టేట ముంచారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, అందని సంక్షేమ పథకాలతో వారందరూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి అష్టకష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు.
సత్తెనపల్లి: జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నడుం బిగించారు. ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూటమి ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా, తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమం ఒక్కటే శరణ్యమని పేర్కొంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా...
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో, ప్రభుత్వ స్కీం విభాగాల్లో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, పారామెడికల్, నర్సింగ్ ఉద్యోగులు, 108, 104 సిబ్బంది, శానిటరీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది 20 నుంచి 30 ఏళ్ల సీనియారిటీ కలిగి ఉన్నారు. ఎప్పటికై నా రెగ్యులర్ కాకపోతామన్న ఆశతో అప్పటి నుంచి చాలీచాలని వేతనంతో ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను లాక్కొస్తున్నారు. అయినప్పటికీ తమ తలరాతలు మారడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. ఎన్నిమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు పాలనలో సమస్యలివీ....
ప్రధాన డిమాండ్లు ఇవీ...
కనీస వేతనాలు అమలు కాక వివిధ శాఖల్లో పనిచేస్తున్న స్కీం ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ఆ మేరకు వేతనాలు పెరగక చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 31న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నాం.
– ఎస్. ఆంజనేయులు నాయక్,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, పల్నాడు


