మహిళల భద్రతలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన సోనిబ్గా వెల్లడి
యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో రెండు బైక్లు ఢీకొన్ని ప్రమాదంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని బోయపాలెం గ్రామంలోని మసీదు వద్ద ఈనెల 17వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యడ్లపాడు పాత రెవెన్యూ కార్యాలయం వద్ద నివాసం ఉండే ఒంటిపులి శ్రీనివాసరావు(34) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం సుమారు రాత్రి 9.50 గంటలకు జరిగిందని, మసీదు సమీపంలోని వాటర్ ప్లాంట్ వద్ద వాటర్ డంబెల్ను స్కూటీపై తీసుకెళ్తున్న క్రమంలో అదే సమయంలో శ్రీనివాసరావు ఆ వైపు రావడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో శ్రీనివాసరావు రోడ్డుపై పడిపోవడంతో తలకు, కంటికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, 108 వాహనంలో కాటూరు మెడికల్ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య త్రివేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణాలు ఎస్ఐ టి శివరామకృష్ణ ఛేదించారు. బోయపాలేనికి వలస వచ్చిన ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉద్దమ్సింగ్నగర్ జిల్లాకు చెందిన సోనిబ్గా గుర్తించామన్నారు. గ్రామంలోనే సెలూన్షాపులో పనిచేస్తున్న అతన్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చీరాల రూరల్: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య ఆదివారం వివరాలు తెలిపారు. ఒంగోలు మరాఠీపాలేనికి చెందిన అనంత ఇందిరాదేవి (56) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. మందులు వాడుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో ఇక వ్యాధి ఎప్పటికీ తగ్గదేమోనని భావించి జీవితంపై విరక్తి చెందింది. వేటపాలెం–చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్లో గుర్తుతెలియని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


