
కమర్షియల్ ట్యాక్స్ ఏసీ నుంచి...
పిడుగురాళ్ల: సివిల్స్ ఫలితాల్లో పిడుగురాళ్ల వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న వావిలపల్లి భార్గవ ఆల్ ఇండియా స్థాయిలో 830 ర్యాంక్ సాధించారు. భార్గవ పిడుగురాళ్ల వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా 2025 ఫిబ్రవరిలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఉద్యోగం నిర్వహిస్తున్న క్రమంలోనే సివిల్స్ ఫలితాల్లో 830 ర్యాంక్ సాధించటం జరిగిందని భార్గవ తెలిపారు. విజయనగరం జిల్లాలోని రాజాం గ్రామానికి చెందిన వావిలపల్లి విష్ణు, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడైన భార్గవ బీటెక్ పూర్తి చేశారు. 2010 నుంచి 2019 వరకు ఎస్బీఐలో ఉద్యోగం చేసిన భార్గవ ప్రస్తుతం పిడుగురాళ్లలో వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని భార్గవ తెలిపారు. నిరుద్యోగ యువత తమ లక్ష్యాల పట్ల దృష్టిసారిస్తే ఉన్నత శిఖరాలను ఆధిరోహిస్తారని ఆయన సూచించారు.