వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ | - | Sakshi
Sakshi News home page

వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ

Apr 21 2025 7:59 AM | Updated on Apr 21 2025 7:59 AM

వెనిగ

వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ

పెదకాకాని: వెనిగండ్లలోని మైత్రి కల్యాణ మండపంలో లైటింగ్‌, డెకరేషన్‌కు వేలంపాటలు నిర్వహించకుండా కొందరు పంచాయతీ ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామ మాజీ సర్పంచి, వైఎస్సార్‌ సీపీ నాయకుడు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంటనే పాటలు నిర్వహించి గ్రామ పంచాయతీ ఆదాయం పెంచాలని అధికారులను కోరారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ప్రభుత్వ భూమిలో కొందరు గ్రామ పెద్దలు సుమారు రూ.కోటి నిధులు సేకరించి కల్యాణ మండపాన్ని నిర్మించారు. గ్రామస్తులకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దీనిని స్వాధీనం చేసుకున్న పంచాయతీ అధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మండపాన్ని ఓసీలకు రూ.18,500కి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.12,500కు ఇస్తున్నారు. ప్రతి వేడుకకూ మరుగుదొడ్ల శుభ్రత పేరుతో మరో రూ.500 వసూలు చేస్తున్నారు. మైక్‌, లైటింగ్‌, ఫ్లవర్‌ డెకరేషన్‌ పేరుతో మరింత దోపిడీ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ వసూళ్ళు పంచాయతీ సిబ్బంది కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం. గత ఏడాది మైత్రి కల్యాణ మండపంలో 175 వేడుకలు జరిగాయి. మైక్‌ అండ్‌ లైటింగ్‌, పూల అంకరణను కొందరు ప్రైవేటు వ్యక్తులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీనిలో పంచాయతీ ఉద్యోగులకు వాటాలు వెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కల్యాణ మండపంలో లైటింగ్‌, పూల అలంకరణకు వేలంపాటలు నిర్వహించకపోవడంతో పంచాయతీ ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం కోల్పోతోంది. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి వేలంపాటలు నిర్వహించాలని మాజీ సర్పంచి కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, గ్రామ ప్రజలు కోరుతున్నారు.

మైక్‌, లైటింగ్‌, డెకరేషన్‌ పేరిట వసూళ్లు వేలంపాటలు నిర్వహించకుండా పంచాయతీ ఉద్యోగుల దొంగాట పారిశుద్ధ్యం పేరుతో ప్రత్యేక రుసుం ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ 1
1/1

వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement