
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలి
మాచర్ల రూరల్: కేంద ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును రద్దు చేసి, దేశంలోని ముస్లింలకు రక్షణ కల్పించాలంటూ ముస్లిం సమైక్య వేదిక, ముస్లిం జేఏసీ నేతృత్వంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకే దేశం.. ఒకే చట్టం అంటూ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన మోదీ, ఎన్నికల్లో గెలిచిన అనంతరం వక్ఫ్ బోర్డు సవరణ చట్టం పేరుతో ముస్లింలను ఇబ్బంది పెట్టే ప్రక్రియను మానుకోవాలని డిమాండ్ చేశారు.వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ముస్లింల ఆస్తులపై భద్రత లేకుండా చేసే ప్రక్రియగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి పార్టీ పునరాలోచన చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా కూటమి నాయకులు సవరణ బిల్లు రద్దుకు చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు అబ్దుల్ రజాక్, ముక్తి సాహెబ్, అమీరా నజీర్, షేక్ జలీల్, కరిముల్లా, సుభాని, షేక్ జాని, ఖాజావలి, మస్తాన్, షేక్ సులేమాన్, కరిముల్లా, యాసిన్, ఇమాం, హుస్సేన్ పాల్గొన్నారు.