రైతులు ఇప్పటికే 15 నుంచి 20 శాతం సాగు కోసం ఖర్చు చేశారు. సాగునీరు అందిస్తా మని చెప్పి ఏరువాక పండుగ చేశారు. బ్యారేజీ వద్ద సాగునీరు వదిలేటప్పుడు ఘనంగా పూజలు నిర్వహించారు. సాగు నీరు ఇవ్వలేమని అప్పుడు ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు వరిసాగు చేయొద్దని చెబితే రైతుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం సాగు నీరు ఇవ్వలేనప్పుడు రైతులకు పూర్తి స్థాయిలో పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి.
– ఉప్పాల రాము,
వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త


