
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
శ్రీకాకుళం(ఘంటసాల): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని ఘంటసాల, కొడాలి గ్రామాల్లోని మద్యం దుకాణాలు మూసివేయగా శ్రీకాకుళంలో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగాయి. షాపు ప్రధాన ద్వారం తాళం వేసి దుకాణ వెనుక భాగంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరపడంతో మందుబాబులు పండుగ చేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు నిర్భయంగా మందు షాపు నిర్వహిస్తుంటే ఎకై ్సంజ్ అధికారులు ఏమయ్యారంటూ పలువురు వాపోతున్నారు. మద్యం షాపు వెనుకే మందు అమ్మడంతో పాటు అక్కడ వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు అమ్మకాలు జరిగాయి. మద్యం ఎక్కడ లేకపోవడంతో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నిర్వాహకులకు బాగానే గిట్టిందని మందుబాబులు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): లోక్ సభలో జాతీయ క్రీడల పాలన బిల్లు –2025 పై ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అన్నారు. స్థానిక చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా యువ ఆంధ్ర ఛాంపియన్ షిప్–2025 కబడ్డీ లీగ్ పోటీలను ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న తర్వాత శివనాథ్ మాట్లాడుతూ 2030లో ఒలింపిక్స్ నిర్వహణకు నేషనల్ బిడ్ దాఖలు చేస్తామని ఎంపీ అన్నారు. కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ప్రభావతి, కార్యదర్శి వై.శ్రీకాంత్, సంఘ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఎన్.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

యథేచ్ఛగా మద్యం అమ్మకాలు

యథేచ్ఛగా మద్యం అమ్మకాలు