ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు

Apr 28 2025 12:55 AM | Updated on Apr 28 2025 12:57 AM

గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి కేంద్రీయ విద్యాలయంలో రెండురోజులుగా జరుగుతున్న రీజనల్‌ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. సంఘటన్‌ వ్యాయామ క్రీడ ల్లో భాగంగా హైదరాబాద్‌ రీజియన్‌ పోటీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎనిమిది టీంలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయం(హైదరాబాద్‌) జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. బొల్లారం కేంద్రీయ విద్యాలయం జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బి.రమేష్‌బాబు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్‌ఐడీ సంచాలకులు భూమ య్య విజేతలకు కప్‌, సర్టిఫికెట్లు అందజేశారు.

ఏడీఎంఈగా డాక్టర్‌ ఏవీరావుకు ఉద్యోగోన్నతి

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఫుల్‌ అడిషనల్‌ చార్జి(ఎఫ్‌ఏసీ)పై పనిచేస్తున్న డాక్టర్‌ ఏ వెంకటేశ్వరరావుకు అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(ఏడీఎంఈ)గా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోనే ఎనస్థీషియా విభాగాధిపతిగా ఉన్న డాక్టర్‌ ఏ వెంకటేశ్వరరావు గత ఏడాది నవంబరు 2న ఎఫ్‌ఏసీపై సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఏడీఎంఈగా ఉద్యోగోన్నతి కల్పించడంతో పూర్తిస్థాయిలో అధికారాలు అప్పగించినట్లయింది. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటేశ్వరరావుకు పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా చెస్‌ పోటీల్లో హర్షిత్‌, శుభశ్రీ సత్తా

విజయవాడస్పోర్ట్స్‌: కృష్ణాజిల్లా స్థాయి అండర్‌–13 బాల, బాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌ బాలుర విభాగంలో హర్షిత్‌సాయి, బాలికల విభాగంలో నాగశుభశ్రీ విజేతలుగా నిలిచారు. విజయవాడ శివారు పోరంకిలోని విజ్ఞానభారతి హై స్కూల్‌లో కృష్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆదివారం ఈ పోటీలను నిర్వహించింది. బాలుర విభాగంలో అబ్దుల్‌ ఫెయిజ్‌, బాలికల విభాగంలో ప్రహస్థా రన్నర్‌లుగా నిలిచారు. వీరిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశామని కృష్ణాజిల్లా చెస్‌ సంఘం కార్యదర్శి ఎన్‌.ఎం.ఫణికుమార్‌ తెలిపారు. అనంతరం ఓపెన్‌ కేటగిరీలో జరిగిన పోటీల్లో సందీప్‌, మోనీష్‌, రుషీల్‌సాయి విజేతలుగా నిలిచినట్లు చెప్పారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు విజ్ఞానభారతి హై స్కూల్‌ డైరక్టర్‌ కె.ఆర్‌.ఎస్‌.రావు, ఫిట్‌నెస్‌ డెవలపర్‌ ఎ.వేణు, కరూర్‌ వైశ్య బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌ పాల్గొని విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్‌లు అందజేశారు.

ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు 1
1/2

ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు

ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు 2
2/2

ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement