నిజామాబాద్ అర్బన్: జిల్లా ఇన్చార్జి (ఎఫ్ఏసీ) కలెక్టర్గా నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం బాధ్యతలు తీసుకోనున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సెలవుపై వెళ్లగా.. ఆమె భర్త, నిర్మల్ జిల్లా కలెక్టర్ అయిన భవేశ్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం (నేడు) ఉదయం 10.30 గంటలకు ఆయన జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్నారు. భవేశ్ మిశ్రా ఇన్చార్జి కలెక్టర్గా 55 రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది.


