సిరికొండ(నిజామాబాద్రూరల్): యూరప్లోని అ త్యున్నత శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని జిల్లాకు చెందిన మాలావత్ పూర్ణ మరోసారి అధిరోహించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చిన్న వయస్సులో అధిరోహించిన సిరికొండ మండలం పాకాలకు చెందిన పూర్ణ.. ప్రము ఖ పర్వతారోహణ సంస్థ ట్రాన్స్సెంట్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించిన బృందానికి ఎక్స్పెడిషన్ లీడర్గా వ్యవహరించారు. పూర్ణ నాయకత్వంలో భారతీయ బృందం ఈనెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు (రష్యా కాలమానం) మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించింది. రష్యా లోని కాకసస్ పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ ఎల్బ్రస్ యూరప్లోని అత్యున్నత శిఖరం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత సెవెన్ సమిట్స్లో ఒకటి. తీవ్రమైన చలి, బలమైన గాలులు ఉంటాయి.


