భీమ్గల్కు చెందిన ప్రముఖ వైద్యుడు మధుశేఖర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15లోగా భీమ్గల్లో నెలకొన్న నాలుగు ప్రధాన ప్రజాసమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో 16 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో భీమ్గల్లో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, రాజకీయాల కన్నా ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


