సిరికొండ: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు స్థిర మైన ఆదాయం లభిస్తుందని జిల్లా ఉద్యాన పట్టు ప రిశ్రమ శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గడ్కోల్, చీమన్పల్లి రైతు వేదికల్లో సోమవా రం ఆయన ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గడ్కోల్ సదస్సులో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుతో రై తులకు అనేక విధాల లాభాలున్నాయని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖను సంప్రదించి ప్ర భుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని సూ చించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరాస్వా మి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోత్సాహకాలను రై తులు సద్వినియోగం చేసుకొని అధిక ఆదాయం పొందాలని తెలిపారు. సర్పంచ్ సండ్ర లతశంకర్, ఏడీఏ కృష్ణ, ఏవో నర్సయ్య, హెచ్వో రోహిత్, తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీవో రఫీ ఉన్నారు.


