స్కూటీని ఢీకొన్న లారీ: ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొన్న లారీ: ఒకరి మృతి

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని బైపాస్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. నగరంలోని గాజులపేటకు చెందిన నవీన్‌(25)అనే యువకుడు పాలు విక్రయిస్తూ, జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం బైపాస్‌ రోడ్డులోని పవర్‌గార్డెన్‌ వద్ద నవీన్‌ స్కూటీపై బయలుదేరగా, అర్సపల్లి వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మూడో టౌన్‌ ఎస్సై హరిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement