
నేరాల నియంత్రణకు చర్యలు
● సీపీ సాయి చైతన్య
వర్ని/రుద్రూర్: నేరాల నియంత్రణకు కఠినచర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైత న్య పేర్కొన్నారు. వర్ని, రుద్రూర్, కోటగిరి పోలీస్ స్టేషన్లను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసిప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో సౌకర్యా లు, సమస్యలపై ఆరా తీశారు. మత్తు పదార్థాలు, గంజాయి, గేమింగ్ యాప్స్, సైబర్ నేరాల బారినపడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్సైలు సాయన్న, మహేశ్ ఉన్నారు.
బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
మాచారెడ్డి: మేన మామను బ్లాక్ మెయిల్ చేస్తూ రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన మేనల్లుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన జీడిపల్లి నరసింహారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లు చేసి షట్టర్లను నిర్మించాడని తన మేనల్లుడు ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గురిజాల మధుసూదన్రెడ్డి సోషల్ మీడియాతోపాటు పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావని మధుసూదన్రెడ్డిని అడిగిన నరసింహారెడ్డిని చంపుతానని బెదిరించి, తప్పుడు ప్రచారం చేయకుండా ఉండాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు మధుసూదన్రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
వర్ని: మండలంలోని పాత వర్ని గ్రామంలో బొగ్గుల వీరయ్యకు చెందిన నివాసపు ఇల్లు శనివారం మధ్యాహ్నం దగ్ధమైంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై దేవుని మండపం వద్ద వెలిగించిన దీపం అంటుకొని మంటలు ఎగిసిపడినట్లు బాధితులు వెల్లడించారు. ఇల్లు పూర్తిగా దగ్ధమై బియ్యం, వంట సామ గ్రి,బట్టలు, నిత్యవసర వస్తువులు పూర్తిగా బూడిదైనట్లు వెల్లడించారు. ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.