
సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ
నిజామాబాద్నాగారం: ఆల్ ఇండియా సీనియర్ ఇంటర్ జోనల్ జాతీయ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు కాంస్య పతకాలు సా ధించారు. జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో ఈనెల 14నుంచి 16వరకు పోటీలు జరుగగా, జిల్లా క్రీడాకారులు సౌత్ జోన్ జట్టు తరపున ఆడి ప్రతిభ చూపారు. ఈసందర్భంగా క్రీడాకారులు వినయ్ (మిట్టపల్లి), మహిళల విభాగంలో వైశాలి (అక్లూర్), సౌమ్యరాణి (పందిమడుగు), మౌనిక (కారేపల్లితండా), నేహ శ్రీ (ధర్మారం) తృతీయస్థానంలో నిలిచారు. దీంతో సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ అనౌకర్, జాయింట్ సెక్రెటరీ శోభన్ బాబు వారికి కాంస్య పతకాలు, ట్రోఫీ అందజేసినట్లు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ తెలిపారు.