బాన్సువాడ: బాన్సువాడ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడ పెద్ద మజీద్ వద్ద నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ముస్లింల కోసం షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టామన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించి పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వడం లేదని విమర్శించారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నాయ కులు వస్తారు.. పోతారని, కానీ కార్యకర్తలు మా త్రం ఎప్పటికీ ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు ఆయేషాబేగం, సుమిత్ర, జుబేర్, కిషన్, మోచీ గణేష్, గౌస్, సాయిబాబా, సాయిలు, శివ, రమేశ్యాదవ్ తదితరులు ఉన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వడం లేదు
ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత