
రుణాల పంపిణీలో రికార్డు
నిజామాబాద్
కోర్టు దూరం.. ప్రజలకు భారం
జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు ఏర్పాటు కోసం భీమ్గల్తోపాటు ఐదు మండలాల ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు.
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లో u
బ్యాక్ వాటర్లో
భారీ జెల్లలు
డొంకేశ్వర్(ఆర్మూర్): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మత్స్యకారుల వలకు భారీ జెల్లలు చిక్కుతున్నాయి. వేసవిలో మాత్రమే జెల్లలు లభిస్తాయని, ప్రస్తుతం వలకు చిక్కుతున్న చేపలు భారీ సైజులో ఉంటున్నాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. జెల్లలకు కోల్కతాలో మంచి డిమాండ్ ఉంటుందని, కిలో రూ.500కుపైగానే ప లుకుతుందని తెలిపారు. డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ బ్యాక్వాటర్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులకు భారీ జెల్లలు చిక్కాయి. ఒక్కోటి నాలుగు అడుగుల పొడవు, పది కిలోల పైనే ఉన్నాయని, వీటిని వ్యాపారులకు విక్రయించామని మత్స్యకారుడు మోహన్ తెలిపారు.
గిరిజన వర్సిటీ
తొలి వీసీకి సన్మానం
బోధన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ తొలి వైస్ చాన్స్లర్గా బోధన్కు చెందిన వైఎల్ శ్రీనివాస్ ఇటీవల నియామకమైన విషయం తెలిసిందే. ఆదివారం ఆయ న కుటుంబసభ్యులతో కలిసి పట్టణ కేంద్రంలోని స్వగృహానికి వచ్చారు. ఈ సందర్భంగా ట్రస్మా ప్రతినిధులు వీసీ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వీసీని కలిసిన వారిలో సాలూర తహసీల్దార్ శశిభూషణ్ దంపతులు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిశోర్, ఇందూర్ హైస్కూల్ ఇంచార్జి స్వాతి, అంజలి, మున్సిపల్ మాజీ చైర్మన్ మహ్మద్ గౌసొద్దీన్, టీపీసీసీ ప్రతినిధి బీ గంగాశంకర్, లయన్స్ కంటి ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ నర్సింహారెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
సాంకేతికతతో మెరుగైన సేవలు
సుభాష్నగర్: సాంకేతికతను అందిపుచ్చుకొని వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పనిలో అధునాతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో మరింత నాణ్యతను మెరుగుపర్చడానికి సిస్టమ్ యావరేజ్ ఇంటరాప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైది), సిస్టమ్ యావ రేజ్ ఇంటరాప్షన్ ఫ్రీక్వేన్సీ ఇండెక్స్ (సైఫీ)గా తీర్చిదిద్దామని తెలిపారు.
సైది, సైఫీతో ప్రయోజనాలు
● విద్యుత్ అంతరాయం ఏర్పడి ఫీడర్లపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టడం.
● సమస్యను తక్కువ సమయంలో గుర్తించి త్వరగా మరమ్మతులు చేపట్టడం.
● ఫాల్ట్ డిటెక్షన్, రియల్–టైమ్ మానిటరింగ్ చేయడం.
● భవిష్యత్లో అంతరాయాలు జరగకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే ఆస్కారం ఉంటుంది.
డొంకేశ్వర్(ఆర్మూర్): బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. గడువుకు ముందే అధికారులు రికార్డు స్థాయిలో రుణాలను పంపిణీ చేశారు. అత్యధిక రుణాలిచ్చిన జాబితాలో నిజామాబాద్ జిల్లా నంబర్ వన్ స్థానంలో ఉంది. సంఘాలకు రుణాలిచ్చి వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న ఐకేపీ ఉద్యోగులు ప్రశంసలు సైతం అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు బ్యాంకు లింకేజీ టార్గెట్ రూ.1,228.71 కోట్లుగా నిర్దేశించారు. వీటిని 20,350 ఎస్హెచ్జీలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది గతేడాది లక్ష్యంతో పోలిస్తే దాదాపు రూ.200 కోట్లు ఎక్కువ. కొండంత లక్ష్యాన్ని చూసి బెదరకుండా ఐకేపీ అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పని చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు జరిపి ఎస్హెచ్జీలకు రుణాలను అందజేశారు. ఫలితంగా గడువుకు ఇంకా పది రోజులు మిగిలి ఉండగానే టార్గెట్ను మించారు. ఇప్పటి వరకు 14,725 ఎస్హెచ్జీలకు రూ.1229.24 కోట్ల (100.04 శాతం) రుణాలను పంపిణీ చేశారు.
90 శాతం చేరుకున్న సీ్త్రనిధి రుణాలు
సీ్త్రనిధి ద్వారా కూడా మహిళా సంఘాలకు రుణాలు అందజేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.211 కోట్లు పంపిణీ చేయాలని జిల్లాకు లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు రూ.198 కోట్లు (90 శాతం) 23,780 మంది మహిళలకు అందజేశారు. ఈ నెలాఖరు నాటికి టార్గెట్ను పూర్తి చేయడానికి వెనుకబడిన మండలాల్లో అధికారులు పర్యటిస్తున్నారు.
తరలివచ్చిన సినీ ప్రముఖులు
ఇందూరు తిరుమలలో నిర్వహించిన శ్రీవారి కల్యాణోత్సవానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, సతీశ్ వేగేశ్న, రచయిత చిన్నికృష్ణ, జబర్దస్త్ వేణు (బలగం), బలగం ఫేమ్ మధు, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్రీల్
వెనుకబడిన ఎనిమిది మండలాలు
బ్యాంకు లింకేజీ రుణాలిచ్చే విషయంలో జి ల్లాలో కొన్ని మండలాలు వెనుకబడి ఉన్నా యి. ఇందులో ధర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయి, రెంజల్, మోర్తాడ్, సిరికొండ, మా క్లూర్, వర్ని ఉన్నాయి. అలాగే లక్ష్యాన్ని చేరుకున్న జాబితాలో మెండోరా, ముప్కాల్, ఏర్గ ట్ల, బాల్కొండ, జక్రాన్పల్లి, డిచ్పల్లి, ఆర్మూ ర్, నవీపేట్, మోస్రా, ఎడపల్లి, నందిపేట్, కమ్మర్పల్లి, బోధన్, నిజామాబాద్ రూరల్, వేల్పూర్, రుద్రూర్, మోపాల్ ఉన్నాయి. లక్ష్యానికి చేరువలో చందూర్, కోటగిరి మండలాలు ఉన్నాయి.
రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన
నిజామాబాద్ జిల్లా
గడువుకు ముందే పూర్తయిన
బ్యాంకు లింకేజీ రుణాల టార్గెట్
మహిళా సంఘాలకు
రూ.1229.24 కోట్లు పంపిణీ
అందరి కృషితో సాధ్యమైంది
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పని చేస్తున్న ఐకేపీ సిబ్బంది కృషితోనే లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమైంది. రాష్ట్రస్థాయిలో ఇతర జిల్లాల కన్నా ఎక్కువ రుణాలిచ్చాం. మిగిలిన పది రోజుల్లో కూడా ఇంకా బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సీ్త్రనిధి లక్ష్యాన్ని కూడా చేరుకుంటాం. – సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామబాద్

రుణాల పంపిణీలో రికార్డు

రుణాల పంపిణీలో రికార్డు

రుణాల పంపిణీలో రికార్డు

రుణాల పంపిణీలో రికార్డు

రుణాల పంపిణీలో రికార్డు

రుణాల పంపిణీలో రికార్డు