నిజామాబాద్ రూరల్: స్వశక్తికి ప్రోత్సాహం తోడైతే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికి వారే యమునతీరే అన్నట్లుగా మారింది. ఇతరులను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు అరుదు. విద్యార్థులు, కళాకారులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని 45 ఏళ్లుగా తోడుగా మేమున్నామంటూ ప్రోత్సహిస్తోంది తెలుగు వెలుగు సమాఖ్య. నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బొక్కసం చంద్రశేఖర్రావు 1980లో ఉగాది పండుగ రోజు ‘తెలుగు వెలుగు సమాఖ్య’ను నెలకొల్పారు. నాటి నుంచి జిల్లాలో ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రతిభావంతులను సత్కరిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతోంది
విద్యార్థులు, కళాకారులకు గుర్తింపు
తెలుగు వెలుగు సమాఖ్య ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 1980లో పదో తరగతిలో జిల్లా ప్రథములుగా వచ్చినవారిని బంగారు పతకాలతో సత్కరించారు. సెప్టెంబర్ 5న ప్రతి ఏడాది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తున్నారు. 1986లో జిల్లాలో సాహిత్యసేవ చేస్తున్న కవులు, కళాకారులు సైబా పరంధాములు, వీపీ చందన్రావు, కందాళై రాఘవాచార్య, శిల్పి రఘు, గర్శకుర్రి రాజేందర్ను సన్మానించారు. 1993లో జిల్లాలో నటుడు ఎన్టీఆర్ పేరిట అవార్డును స్థాపించి మొదటి అవార్డును ఇంద్రజాల ప్రదర్శకుడు రంగనాథ్కు ప్రదానం చేశారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తూ ప్రతిభాపాఠవాలు పెంపొందిస్తోంది. పేద కుటుంబాలకు ఆర్థిక సాయం, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నోట్బుక్కులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి, ఉగాది పురస్కారాలతో కళాకారులను సన్మానిస్తోంది. డాక్టర్స్ డే, టైలర్స్ డే, ఫొటోగ్రాఫర్స్ డే, మాతృభాషా దినోత్సవం, కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ 45 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది తెలుగు వెలుగు సమాఖ్య. ముఖ్య కార్యదర్శిగా సేవలందిస్తున్న చంద్రశేఖర్ ఇప్పటి వరకు ప్రముఖుల ప్రశంసలు, సన్మానాలు పొందారు.
ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్న సమాఖ్య
45 ఏళ్లుగా సేవలు
ప్రతిభను వెలికితీసేందుకే..
కవులు, కళాకారులతోపాటు అన్నిరంగాల వారిని ప్రోత్సహించేందుకు సమాఖ్య ను ఏర్పాటు చేశాం. మాతృభాషను బతికించి భావితరాలకు దాని గొప్పదనాన్ని తెలియజేస్తున్నాం. సమాజంలో అన్నివర్గాలకు సేవ చేయ డం నా ఆశయం. – చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి
సేవ.. ప్రోత్సాహం @ తెలుగు వెలుగు
సేవ.. ప్రోత్సాహం @ తెలుగు వెలుగు
సేవ.. ప్రోత్సాహం @ తెలుగు వెలుగు