సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో సుదీర్ఘకాలం సర్వీసులో ఉండే బ్యూరోక్రాట్లు, అధికారులు, ఉద్యోగులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన నేపథ్యంలో తరచూ వివాదాస్పదం అవుతున్నారు. ఈ విషయమై ఉమ్మడి జిల్లాలో బీజేపీ నేతలు ఆయా అధికారు ల వ్యవహారశైలిపై బహిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ఈ విషయాలు సాధారణ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నా యి. ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇలా వివా దాలకు కేరాఫ్గా మారుతుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
● తాజాగా నిజామాబాద్లో కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని పసుపు బోర్డు సమావేశంలో చైర్మన్ పల్లె గంగారెడ్డి నేరుగా జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుపైనే విమర్శలు సంధించారు. జనవరిలో పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లోనే నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ను సంప్రదించగా పండుగ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరంటూ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తిరస్కరించారని గంగారెడ్డి అధికారిక సమావేశంలోనే తెలిపారు. కొన్ని అపోహలు తొలగించేందుకు ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు తెలపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. దీంతో అక్కడకు వచ్చిన రైతులు, ఉన్నతాధికారుల్లో చర్చ జరిగింది. ఇదిలా ఉండగా మంగళవారం జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్లు, జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్న సమావేశం గురించి సైతం జిల్లా పౌరసంబంధాల అధికారికి తెలియకపోవడం గమనార్హం.
● జక్రాన్పల్లి మండలంలోని లక్ష్మాపూర్లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్ విషయమై కేఆర్ సుదర్శన్రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తీసుకుని కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్లకు ఫిర్యాదులు చేశారు. అక్రమ క్రష ర్ నిర్వాహకుడికి అనేకసార్లు నోటీసులు ఇచ్చా రు. చర్యలు తీసుకోలేదని అడిగితే ఆ విషయమే తమకు తెలియదని చెబుతున్నారని సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ విషయమై సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు
చెరుగుతున్న బీజేపీ నేతలు
ఆర్టీఐ దరఖాస్తులను
పట్టించుకోవడంలేదని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కేవీఆర్
పసుపు బోర్డు ప్రారంభ
సమావేశానికి సహకరించని కలెక్టర్
కలెక్టరేట్లో ఏర్పాటు చేయనీయలేదు : బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శాసనసభలోనే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. కామారెడ్డిలో విద్య, వైద్య శాఖల్లో వివిధ అంశాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద 86 దరఖాస్తులు ఇస్తే ఏమాత్రం సమాధానాలు ఇవ్వలేదన్నారు. పైగా తానే స్వయంగా దరఖాస్తు ఇవ్వడా నికి వెళితే ఇలాంటివి చాలా చూశాం.. అ య్యేవా.. పోయేవా అంటూ ఉద్యోగులు, అ ధికారులు మాట్లాడారన్నారు. అధికారుల కు ఇది మంచి పద్ధతి కాదన్నారు. సదరు అధికారుల పేర్లు సైతం చెప్పగలుగుతానన్నారు. సమాచారం అధికారులు ఇచ్చేది లేదని చెబితే ఎలా అన్నారు. ప్రతీది ఫైల్తో సహా తనవద్ద ఉందన్నారు. అధికారులు గౌరవంగా వ్యవహరిస్తే బాగుంటుందన్నా రు. ఈ ప్రవర్తన అందరికీ సిగ్గుచేటన్నారు. పద్ధతి మార్చుకోకుండా రాబోయే కాలంలో తన పద్ధతి మార్చుకునేలా చేస్తారా అని అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో ఓడినవారు, నియోజకవర్గం నుంచి పారిపోయిన వారి పేరిట ప్రతిపాదనలు ఇవ్వడమేమిటి.. ఇన్చార్జి మంత్రి మంజూరు చేయడమేమిటన్నారు. ఇలా అయితే ప్రజలచే ఎన్నుకోబడిన తానేం చేయాలంటూ పరోక్షంగా షబ్బీర్ అలీపై కేవీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు.