అడ‌విలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాత‌కంగా.. | - | Sakshi
Sakshi News home page

అడ‌విలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాత‌కంగా..

Nov 27 2023 12:44 AM | Updated on Nov 27 2023 9:04 AM

- - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై

సాక్షి, నిజామాబాద్‌: జుక్కల్‌మండలంలోని పుల్కల్‌కు చెందిన శాదుల్‌ (20) గ్రామ శివారు గుట్టలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై మురళి ఆదివారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన శాదుల్‌ కట్టెలు తీసుకురావడానికి సమీపంలోని గుట్టకు వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి రా కపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. కుటుంబ సభ్యులు ఆదివారం గుట్టపై పరిశీలించగా మృతి చెంది ఉన్నాడు. పొలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి ముఖానికి గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement