ప్రియదర్శినినగర్ రోడ్ నంబర్–2లో భారీ గుంతలో నిలిచిన నీరు
ఇంద్రనగర్ నుంచి గుల్లపేట వెళ్లే ప్రధాన రహదారిపై నిలిచిన నీరు
గుంతలు, పశువులతో సాగర్ కాలనీ నుంచి హాస్పిటల్ వెళ్లే రోడ్డు
జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షానికే భారీగా వర్షపు నీరు చేరి చిత్తడవుతున్నాయి. వాహనదారులు, పాదచారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై గుంతలు పూడ్చివేయించి ఇబ్బందులు తీర్చాలని ఆయా కాలనీలవాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


