భైంసాటౌన్: పౌరసరఫరాల శాఖ తెల్లరేషన్కార్డు దారులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఈనెల 31లోపు కార్డులోని కుటుంబ స భ్యులంతా సమీప రేషన్ డీలర్ వద్ద ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ కేవైసీ చేసుకోనివారికి ఆగస్టు నుంచి రేషన్ కోటా నిలిపివేస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారంలో పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకున్నవారికే ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధి దారులందరికీ రేషన్ సక్రమంగా అందించేందుకు, మరణించిన, అనర్హుల పేర్లు తొలగింపు, నకిలీ కార్డులు ఏరివేసేందుకే కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 412 రేషన్ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో అన్నపూర్ణ, అంత్యోదయ, తెల్లకా ర్డుదారులకు ప్రతీనెల 4,867.16 మెట్రిక్ ట న్నుల బియ్యం అందిస్తున్నారు. ఆగస్టు నుంచి మూడునెలల కోటా ఒకేసారి పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 2,49,606 కార్డులుండగా, ఇప్పటివరకు 91.17 శాతం కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయింది. అ లాగే, 7,74,020 మంది లబ్ధిదారులుండగా, 73.27 శాతమే ప్రక్రియ పూర్తయింది. మిగతావారూ గడువులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తప్పనిసరిగా చేయించుకోవాలి
ప్రభుత్వం రేషన్కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఈనెలాఖరుతో గడువు ముగుస్తుంది. సమీప రేషన్ దుకాణాల్లో ఎక్కడైనా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దూరప్రాంతాల్లో పిల్లలుంటే అక్కడి రేషన్ దుకాణాల్లోనూ చేయించుకోవచ్చు.
– రాజేందర్, డీసీఎస్వో
జిల్లాలోని రేషన్ సమాచారం
మొత్తం రేషన్కార్డులు 2,49,606
లబ్ధిదారుల సంఖ్య 7,74,020
కేవైసీ పూర్తయిన కార్డులు 2,27,554
కేవైసీ పూర్తయిన లబ్ధిదారులు 5,67,129


