న్యూస్రీల్
ఓపెన్ యూనివర్సిటీకి ఎంపిక
ముధోల్: నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సి టీ) అధ్యయన కేంద్రంగా ఎంపికై నట్లు కళాశా ల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య తెలిపారు. శనివారం భైంసా పట్టణంలో ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ను అధ్యాపకులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఓపెన్ యూనివర్సిటీ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేను శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్తోపాటు కోఆర్డినేటర్ పవన్ పాండే, అధ్యాపకుడు సంజీవ్కుమార్ మాట్లాడుతూ.. అధ్యయన కేంద్రం ఏర్పాటుతో ముధోల్ పరిసర ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు.


