అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

Jan 6 2026 1:58 PM | Updated on Jan 6 2026 1:58 PM

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

● ఎస్పీ జానకీషర్మిల

● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యలను పోలీస్‌ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం తెలియజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement