Vande Bharat: ఏసీ కోచ్‌లో లీకైన నీళ్లు.. ఇక నా డబ్బులో నాకివ్వండి! | Video Showing Water Leakage On Delhi Bound Vande Bharat | Sakshi
Sakshi News home page

Vande Bharat: ఏసీ కోచ్‌లో లీకైన నీళ్లు.. ఇక నా డబ్బులో నాకివ్వండి!

Jun 24 2025 9:52 PM | Updated on Jun 24 2025 9:55 PM

Video Showing Water Leakage On Delhi Bound Vande Bharat

న్యూఢిల్లీ: వందే భారత్‌ ట్రైన్‌లో ఏసీ కోచ్‌లో నీళ్లు లీకైన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీ నుంచి వెళ్ళ్లే ఓ వందే భారత్‌ ట్రైన్‌లో ఏసీ పని చేయకపోవడంతో వాటర్‌ లీకేజ్‌ ఏర్పడింది. తాను వందే భారత్‌ ట్రైన్‌లో ప్రయాణించిన సమయంలో ఏసీ నుంచి నీళ్లు ధారలా తన సీటపైకి వచ్చాయన్నాడు ధర్శిల్‌ మిశ్రా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

ఇలా లీకేజ్‌ జరుగుతూనే ఉందని, ఈ విషయాన్ని రైల్వే సిబ్బందికి రిపోర్ట్‌ చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించి వీడియోను షేర్‌ చేస్తూ.. ఇది నా కోచ్‌లో జరిగిందంటూ పేర్కొన్నాడు. అత్యధిక ఖరీదుతో కొనుగోలు చేసిన వందే భారత్‌ ట్రైన్‌లో ఇలా జరగడంపై అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రయాణంలో సుఖం లేదు. అంతా అసౌకర్యమే.  రైల్వే సిబ్బందికి పట్టించుకోలేదు. మరి అటువంటప్పుడు నేను టికెట్‌ కొన్న డబ్బులు తిరిగి చెల్లించండి’ అంటూ పేర్కొన్నాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement