శ్రీరాముని దర్శనం కోసం భక్తులు బారులు | Thousands of Devotees Had Darshan In Ram Janmbhoomi Mandir | Sakshi
Sakshi News home page

Ayodhya: శ్రీరాముని దర్శనం కోసం భక్తులు బారులు

Jan 2 2024 7:06 AM | Updated on Jan 2 2024 8:34 AM

Thousands of Devotees Darshans in Ram Janmbhoomi - Sakshi

నూతన సంవత్సరం సందర్భంగా అయోధ్యలో రోజంతా భక్తుల సందడి కనిపించింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని, శ్రీరాముని దర్శించుకున్నారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

నూతన సంవత్సరం సంద్భంగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో నాలుగు వేదాలలోని అన్ని శాఖల పారాయణం, యాగం నిరంతరం కొనసాగుతున్నాయి. 
ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వేద పండితులు, యాగ్యాచార్యులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement