Tamil Nadu: 1 lakh students didn't appear for public exam over fear - Sakshi
Sakshi News home page

పరీక్షలకు భయపడి పాఠశాలకు రాని లక్షమంది విద్యార్థులు.. ఎక్కడంటే!

Published Thu, Mar 30 2023 1:52 PM

Tamil Nadu: One Lakh 10 Students Didnot Appear Public Exam Over Fears - Sakshi

కొరుక్కుపేట(చెన్నై): పబ్లిక్‌ పరీక్షలకు భయపడి దాదాపు లక్ష మంది 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు రాకుండా నిలిచిపోయారు. ప్రసుత్త విద్యా సంవత్సరంలో లక్షమందికి పైగా విద్యార్థులు పాఠశాలలకు రావడం మానేసినట్లు వెల్లడైంది. తమిళనాడు వ్యాప్తంగా జిల్లాల వారీగా నిర్వహించిన సర్వేలో ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.

ఈనేపథ్యంలో ఆ విద్యార్థులను పబ్లిక పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గైర్హాజరైన విద్యార్థుల పేర్లు, వివరాలు సేకరించి పరీక్షకు తీసుకురావాలని, ఆ బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని తేల్చింది.

Advertisement
Advertisement