విద్యార్థులతో మేడమ్‌ రాసలీలలు వైరల్‌.. దర్యాప్తు ముమ్మరం | Tamil Nadu Madhurai Teacher Intimacy Video Viral Probe Going On | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో మేడమ్‌ రాసలీలలు వైరల్‌.. దర్యాప్తు ముమ్మరం

Apr 7 2022 8:23 AM | Updated on Apr 7 2022 8:36 AM

Tamil Nadu Madhurai Teacher Intimacy Video Viral Probe Going On - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముగ్గురు విద్యార్థులతో రాసలీలలు చేస్తూ.. వాటిని వీడియో తీసి వైరల్‌ తీసింది ఓ గవర్నమెంట్‌ టీచర్‌. 

చెన్నై: తమిళనాడులో ఓ గవర్నమెంట్‌ టీచర్‌ చేసిన పని సంచలనంగా మారింది. ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలవడమే కాదు.. ఆ చెండాలాన్ని వీడియో తీసి వైరల్‌ చేసిన ఘటన పెనుదుమారం రేపింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ఘటన కావడంతో స్వయంగా తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.

మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తోంది సదరు టీచర్‌(42). ఈ క్రమంలో ఓరోజు ముగ్గురు విద్యార్థులను ఇంటికి రప్పించుకుని.. వాళ్లతో శారీరకంగా కలిసింది. ఈ తతంగాన్ని 39 ఏళ్ల వయసున్న ఆమె ప్రియుడు, స్థానిక వ్యాపారవేత్త ఒకడు వీడియో తీశాడు. ఆపై ఆ వీడియోను తన స్నేహితుల సాయంతో వాట్సాప్‌ ద్వారా సర్క్యూలేట్‌ చేశాడు. 

వీడియో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో తమిళనాడు డీజీపీ కార్యాలయం స్పందించింది. తక్షణమే ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు చేయాలని మధురై సైబర్‌ సెల్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై టీచర్‌, ఆమె ప్రియుడ్ని మధురై పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. 

భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ.. 2010 నుంచి సదరు వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోంది. కేవలం వైరల్‌ కావడం కోసమే ఆ వీడియో తీశారా? లేదంటే.. అశ్లీల సైట్లలో అప్‌లోడ్‌ చేసి డబ్బు సంపాదించాలనుకున్నారా? బ్లాక్‌మెయిలింగ్‌ కోణం ఉందా? అనేది సైబర్‌విభాగం తేల్చాల్సి ఉంది.  వీడియోను ఎవరికి పంపారు? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 

మరోవైపు ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు సదరు టీచర్‌పై, ఆమె ప్రియుడిపై మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement