కరోనా: తమిళనాడు మంత్రి కన్నుమూత | Tamil Nadu Agriculture Minister Dies With Corona | Sakshi
Sakshi News home page

కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత

Nov 1 2020 9:54 AM | Updated on Nov 1 2020 12:04 PM

Tamil Nadu Agriculture Minister Dies With Corona - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి దురైక్కన్ను(72) కన్నుమూశారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్వాస ఇబ్బందులతో గత నెల 13న చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో దురైక్కన్ను చేరారు. అనంతరం అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్యం మరింత విషమించింది. ఈ క్రమం‍లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం  ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి మృతిపట్ల తిమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement