కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు  | Somu Veerraju Appointed As Andhra Pradesh BJP President | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు 

Jul 31 2020 3:52 AM | Updated on Jul 31 2020 3:56 AM

Somu Veerraju Appointed As Andhra Pradesh BJP President - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆలోచనా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతంగా ముందుకు తీసుకెళతామని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కేంద్రానికి రాజధానితో సంబం ధం లేదని స్పష్టం చేశారు. గతంలో మూడు రాష్ట్రా లు ఏర్పడినప్పుడు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ మాత్రం రాజధానికి మద్దతుగా ఉంటుందన్నారు. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడైనా రాజధాని కట్టే సందర్భంలో కేంద్ర జోక్యం అనే ప్రశ్న వచ్చిందా?.. రాదు.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు.

మూడు రాజధానులంటే మమ్మల్ని కలగజేసుకోమంటున్నారు. కేంద్రం ఏ విషయంలో కలగజేసుకుంటుంది? ఇళ్లు ఇచ్చే విషయంలో కలగజేసుకుంటుంది. ఇంటికి రూ. 1.5 లక్షలు కేంద్రం ఇస్తోంది. ఇదీ కలగజేసుకోవడమంటే. చంద్రబాబు రాజధాని నిర్మాణం ఉందంటే, రమ్మంటేవెళ్లాం. రిబ్బన్‌ కత్తిరించాం. ఇప్పుడు ఈయన (సీఎం జగన్‌) మూడంటున్నారు. మూడు రాజధానులంటే మీరు కలగజేసుకుంటారా? లేదా? అని టీడీపీ నేతలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రాజధాని అక్కడ ఉండాలని చెబుతున్నాం. రైతులకు మా మద్దతు ఉంటుందని చెబుతున్నాం. అంతేగానీ ఏది మీరు నిర్ణయిస్తే, మీరు ఏది ఉద్యమంగా నిర్మాణం చేస్తే దానికి వంతపాడాలా? మీరు మమ్మల్ని ఇరుకునపెట్టేలా ప్రయత్నిస్తే జడుసుకునే పార్టీ కాదు మాది’ అని వీర్రాజు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement