బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టుల మృతి | Six Maoists killed in encounter with security forces in Chhattisgarh | Sakshi
Sakshi News home page

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టుల మృతి

Nov 11 2025 8:11 PM | Updated on Nov 11 2025 8:44 PM

Six Maoists killed in encounter with security forces in Chhattisgarh

బీజాపూర్‌:  చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు  బీజాపూర్‌ నేషనల్‌ పార్క్‌  ఏరియాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌తో కలిసి జరిపిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయాన్ని బీజాపూర్‌ ఎస్పీ డా. జితేంద్ర యాదవ్‌ వెల్లడించారు.  

ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు మావోయిస్టులు సంచరిస్తున్న విషయాన్ని అందుకున్న బీజాపూర్‌, దంతేవాడ రిజర్వ్‌ గార్డ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌లు సంయుక్తంగా  ఆపరేషన్‌ చేపట్టామని,  ఈ క్రమంలోనే తమకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులను మట్టుబెట్టినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి స్టెన్‌ గన్స్‌, ఆటోమేటిక్‌ వెపన్స్‌, రైఫిల్స్‌, ఇతర మారణాయుధాలను, భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్ల పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement