తాను చేసిన స్వీటును తానే తిననని చెప్పిన దుకాణదారుడు | The shopkeeper refused to eat his own sweets | Sakshi
Sakshi News home page

తాను చేసిన స్వీటును తానే తిననని చెప్పిన దుకాణదారుడు

Aug 21 2026 9:21 PM | Updated on Aug 21 2026 9:30 PM

The shopkeeper refused to eat his own sweets

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని మౌదహా పట్టణంలో పండుగల నేపథ్యంలో ఎస్‌డీఎం, ఆహార శాఖ అధికారులు కల్తీ స్వీట్లకు వ్యతిరేకంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మా వైష్ణో జై భవానీ స్వీట్ హౌస్ నిర్వాహకుడు బాబాకు ఆయన దుకాణంలో ఉన్న వెండి పూత వేసిన స్వీట్‌ను తినాలని అధికారులు చెప్పారు. 

అయితే దానిని తినేందుకు ఆయన స్పష్టంగా నిరాకరించారు. దుకాణదారు తినేందుకు నిరాకరించడంతో ఎస్‌డీఎం కరణ్‌వీర్ సింగ్ స్వీట్ల నమూనాలు సేకరించి, ఆ స్వీట్లను పారేయించారు. ఈ చర్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది. అధికారులు పదేపదే చెప్పినప్పటికీ ఆయన ఆ స్వీట్ తినేందుకు నిరాకరించారు. ఈ ఘటన తర్వాత ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి.

అపరిశుభ్రత, నిషేధిత వెండి పూత వాడకం
ఆహార శాఖ సహాయ కమిషనర్ గోరీ శంకర్, ఆహార భద్రత అధికారి మృత్యుంజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం పలు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపింది. తనిఖీల్లో 2 దుకాణాల్లో అపరిశుభ్రత కనిపించింది. స్వీట్లలో నిషేధిత వెండి పూతను ఉపయోగించిన విషయం కూడా బయటపడింది. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌డీఎం కరణ్‌వీర్ సింగ్ తెలిపారు.

ఇదీ చదవండి: ఎల్‌ నినో: మనకు ముప్పు తట్టుకోలేని విధంగా ఏ స్థాయిలో అంటే?

మార్కెట్‌లో కలకలం.. పోలీసు బలగాల మోహరింపు
సంయుక్త తనిఖీల విషయం తెలియగానే మౌదహా పట్టణంలోని ఇతర స్వీట్ విక్రేతల్లో కలకలం రేగింది. ఈ చర్యల సమయంలో ప్రాంతీయ అధికారి రాజ్‌కుమార్ పాండే, కోత్వాలీ ఇన్‌చార్జ్ సంతోష్ కుమార్ పోలీసు బలగాలతో అక్కడే ఉన్నారు. పండుగల సమయంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేవారిపై చేపడుతున్న ఈ కార్యక్రమం  కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement