ఆ పార్టీలది ఫ్రస్ట్రేషన్: ప్రధాని చురక | Pm Modi Reacts On Opposition Parties Parliament Ruckus | Sakshi
Sakshi News home page

వాళ్ల నంబర్లు మరింత పడిపోవడం ఖాయం: మోదీ

Dec 19 2023 11:58 AM | Updated on Dec 19 2023 12:11 PM

Pm Modi Reacts On Opposition Parties Parliament Ruckus - Sakshi

photo credit:​HINDUSTAN TIMES

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షాలు నిరాశ నిస్పృహలోకి వెళ్లాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ నిస్పృహతోనే ఆ పార్టీలు పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయన్నారు. మంగళవారం(డిసెంబర్‌19)ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష పార్టీల ఈ తరహా ప్రవర్తన వల్ల రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో వాళ్ల నంబర్లు మరింత దిగజారుతాయని,బీజేపీ మరిన్ని సీట్లు గెలుచుకుంటుందన్నారు. కాగా, పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ డిమాండ్‌తోనే  ఆపార్టీలు పార్లమెంట్‌ సెషన్‌ను అడ్డుకుంటుండడంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోపక్క పార్లమెంట్‌లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది.   

ఇదీచదవండి..గెలవాలనుకుంటే నితీశ్‌, నిశ్చయం.. రెండూ కావాలని పోస్టర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement