మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటే: రాహుల్‌ గాంధీ | Parliament Monsoon Session 2026 Day 6 Live Updates And Top News Headlines, Debate On NEET Paper Leak Bill And More Topics | Sakshi
Sakshi News home page

Anti-paper Leak Bill: మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటే: రాహుల్‌ గాంధీ

Jul 27 2026 10:12 AM | Updated on Jul 27 2026 12:03 PM

Parliament Monsoon Session 2026 Live day 6 Updates

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం నేపథ్యంలో కేంద్రం తీసుకొస్తున్న పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు-2026పై పార్లమెంట్‌లో వేడి చర్చకు రంగం సిద్ధమైంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.

పార్లమెంట్‌ సమావేశాలు.. 6వ రోజు అప్‌డేట్స్‌

  • వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు

ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

  • నీట్‌ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.
  • ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ను ఖర్గే కోరారు.
  • రూల్‌ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.
  • భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.
  • ఖర్గే డిమాండ్‌పై స్పందించిన రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌.. రూల్‌ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
  • నీట్‌ నిరసనల అంశం మాన్సూన్‌ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

‍మోదీ సర్కార్‌పై రాహుల్‌ గాంధీ ఫైర్‌

  • పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా
  • పార్లమెంట్‌ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన
  • ప్రధాని మోదీపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌
  • విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటే
  • ఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారు
  • ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే

 

 

 

జంతర్‌ మంతర్‌లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

  • ఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.
  • విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం 
  • ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరం
  • శాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.
  • నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలి
  • నిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.
  • విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.

ఉభయ సభలు వాయిదా!

  • ఆరో రోజు అదే తీరు

  • నీట్‌పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు

  • ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

  • ఉభయ సభలు మధ్యాహ్నం  12గం. దాకా వాయిదా

ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయ సభలు

  • లోక్‌సభలో విపక్ష ఎంపీల ఆందోళన

  • పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచన

  • లాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు

     

పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలు

  • పార్లమెంట్‌ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలు
  • పార్లమెంట్‌కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • ధర్మేంద్ర ప్రధాన్‌కు హీరో వెల్‌ కమ్‌ చెప్పిన ఎన్డీయే ఎంపీలు
  • కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలు
  • నీట్‌ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌

ఊహించినట్లే.. కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం

  • పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం

  • విద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్‌ గన్స్‌తో దాడిపై చర్చకు నోటీసు

  • జంతర్‌ మంతర్‌ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగం

  • చలో సంసద్‌ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలు

  • తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్‌

  • అమిత్‌ షాకు లేఖ రాసిన రాహుల్‌ గాంధీ

  • విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేత

పరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!

  • నేడు లోక్‌సభలో  పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చ
  • బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్
  • బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం
  • బీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభం
  • బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగం
  • టీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలు
  • జేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారు
  • శివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగం
  • అప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారు
  • ఎల్‌జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశం
  • ఎన్సీపీ తరఫున సునీల్ తట్కరే
  • తృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశం
  • పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యం
  • బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తి

సభ.. సజావుగా సాగేనా?

  • సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్‌ సమావేశాలపై అందరి దృష్టి

  • గతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్‌

  • కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలు

  • నీట్‌ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం

  • అయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..

  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో శాంతించిన యువత

  • ఆందోళన విరమించిన కాక్రోచ్‌ జనతా పార్టీ

  • నేడు పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ సవరణ బిల్లు

  • కాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశం

  • యువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలు

  • దాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్‌ షాకు లేఖ రాసిన రాహుల్‌ గాంధీ 

బిల్లులో కీలక ప్రతిపాదనలు

  • పేపర్‌ లీక్‌ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.
  • లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.
  • నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.
  • వ్యవస్థీకృతంగా పేపర్‌ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.
  • ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు.
  • కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.

ఎన్డీయే వ్యూహం ఏంటి?

  • పేపర్‌ లీక్‌లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.
  • యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.
  • బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్‌, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.
  • టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.

విపక్షాల వ్యూహం ఏమిటి?

  • బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్‌ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.
  • పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.
  • జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌ మార్చ్‌ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
  • ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసే అవకాశం.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్‌ సమరం

  • నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు.
  • ఆయన స్థానంలో ప్రహ్లాద్‌ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.
  • కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.
  • నీట్‌ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

10 గంటల పాటు చర్చ

  • బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.
  • దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.
  • అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.

36 రోజుల ఉద్యమం తర్వాత..

  • నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు జరిగాయి.
  • విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
  • పార్లమెంట్‌ మార్చ్‌ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement