ఎల్‌ఓసీ వెంట చైనా దుశ్చర్య | Pakistan Army deploying new Chinese cannon on LoC | Sakshi
Sakshi News home page

ఎల్‌ఓసీ వెంట చైనా దుశ్చర్య

Jun 26 2023 5:23 AM | Updated on Jun 26 2023 5:23 AM

Pakistan Army deploying new Chinese cannon on LoC - Sakshi

న్యూఢిల్లీ:  భారత్, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంట పాకిస్తాన్‌ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్‌ టవర్లను పాకిస్తాన్‌కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్‌ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్‌హెచ్‌–15 శతఘ్నులను ఎల్‌ఓసీ వద్ద పాక్‌ మోహరించిందని పేర్కొన్నారు. పాక్‌ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement