
న్యూఢిల్లీ: కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణకు చెందిన బాధితులు ఉంటే వెంటనే స్పందించేందుకు, ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణభవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ ఘటనలో తెలంగాణకు చెందినవారు మరణించినట్టు, గాయపడ్డవారు లేదా గల్లంతైనవారుగా లేరని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
అయినా, పర్యాటకులకు సంబంధించిన ఏదైనా సమాచారం అందితే తక్షణ స్పందన కోసం ఈ హెల్ప్లైన్ను యాక్టివ్లో ఉంచారు. తెలంగాణ భవన్కు చెందిన అధికారులు వందన (9871999044), హైదర్ అలీ నఖ్వీ (9971387500)లు హెల్ప్లైన్లో అందుబాటులో ఉంటారని తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ఉప్పల్ పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం పర్యాటకుల కోసం ఢిల్లీలోని ఏపీభవన్లో అత్యవసర హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఏపీ భవన్కు చెందిన అధికారి వి.సురేశ్బాబు (9818395787) లేదా, 01123387089 నంబరులో సంప్రదించొచ్చని ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.