గుడ్లవల్లేరు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌ | NHRC takes suo motu cognizance of hidden camera incident in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గుడ్లవల్లేరు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

Sep 3 2024 5:01 AM | Updated on Sep 3 2024 5:01 AM

NHRC takes suo motu cognizance of hidden camera incident in Andhra Pradesh

సుమోటోగా కేసు నమోదు 

సీఎస్, డీజీపీలకు నోటీసులు  

రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు  

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనలో వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నో రోజులుగా వ్యవహారం జరుగుతున్నా బయటకెందుకు రాలేదని ప్రశి్నంచింది. అర్థరాత్రి వరకూ విద్యార్థినులు ధర్నా చేయడం.. ఘటనపై వివిధ పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచి్చనట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.

పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై  సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. విద్యార్థినుల వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డ్‌ చేసి, వాటిని అమ్మడం వంటి వ్యవహారాలు జరగడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడింది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందని తీవ్రస్థాయిలో ప్రశి్నంచింది.  రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం తమకు వివరించాలని అందులో పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement