India Covid Cases: మళ్లీ కరోనా టెన్షన్‌.. ఒక్క రోజులో 33 శాతం అధికంగా కేసులు నమోదు!

New Delhi: India Reports New Corona Cases Live Updates - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కేసులు ఒక్క రోజు వ్యవధిలో భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల ప్రకారం.. మంగళవారం 4.40 లక్షల మందిని పరీక్షించగా.. 8,822 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. క్రితం రోజు ఆ సంఖ్య 6,594 గా ఉంది. దీంతో ఒక్క రోజు తేడాలో 33 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి.

గడిచిన ఒక్క రోజులో 15 మంది మరణించగా.. ఇప్పటివరకు మొత్తం 5,24 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 98.66 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. మరణాల రేటు 1.21 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 195.35 కోట్ల కోవిడ్‌ టీకాలను కేంద్రం పంపిణీ చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది.

చదవండి: Agnipath Recruitment Scheme: రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరే వారు తప్పక తెలుసుకోండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top