ప్రధాని మోదీని చంపేస్తామంటూ ఎన్‌ఐఏకు మెయిల్‌

Mumbai NIA Office Received PM Modi Assassination Threat Mail - Sakshi

ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ ఒకటి ముంబైలోని ఎన్‌ఐఏ(నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) కార్యాలయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. 

ప్రధాని మోదీ హత్యకు 20 మంది స్లీపర్‌ సెల్స్‌ను తయారు చేశామని, 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను సిద్ధం చేశామని ఆగంతకులు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ మెయిల్‌ను ధృవీకరించిన ముంబై ఎన్‌ఐఏ కార్యాలయం.. ప్రధాని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీనిపై మరింత అప్‌డేట్స్‌ అందాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top