ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి మిగ్‌-23 విమానం | MiG-23 Aircraft on OLX For Sale | Sakshi
Sakshi News home page

రూ. 9. 99 కోట్లు.. ఆకతాయిల చర్య అంటున్న యూనివర్సిటీ

Aug 4 2020 6:23 PM | Updated on Aug 4 2020 7:15 PM

MiG-23 Aircraft on OLX For Sale - Sakshi

లక్నో: ఓఎల్‌ఎక్స్‌లో ఎవరైనా మొబైల్ ఫోన్లు, బైకులు, ఫర్నిచర్ అమ్మకానికి పెడతారు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న యుద్ధ విమానం మిగ్‌-23నే అమ్మకానికి పెట్టాడు. అది కూడా 9.99 కోట్ల రూపాయలకు. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న ఈ విమానాన్ని అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి 2009 లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బహుమతిగా ఇచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఐఏఎఫ్‌ దీన్ని యూనివర్సిటీకి ఇచ్చింది. (అమ్మకానికి పటేల్‌ విగ్రహం..!)

ఇంతటి చరిత్ర  కలిగిన ఈ మిగ్‌-23 యుద్ధ విమానాన్ని ప్రస్తుతం ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచడంతో సంచలనం రేపుతోంది. ఎవరో కావాలనే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి విమానం ఫోటోను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టారని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రొక్టార్ ప్రొఫెసర్ మహమ్మద్ వసీం అలీ మాట్లాడుతూ.. ‘మా యూనివర్సిటీకి చెందిన వారు ఎవరూ ఆ విమానాన్ని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టలేదు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని’ అని తెలిపారు. ఈ విషయంపై తాము విచారణ చేపట్టామని, ఈ పని ఎవరు చేశారో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వసీం అలీ వెల్లడించారు. అంతేకాక సదరు విమానం ఫొటోను వెబ్‌సైట్‌ నుంచి తీసేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement