అపురూపం.. ఈ జంట వివాహం | Sakshi
Sakshi News home page

అపురూపం.. ఈ జంట వివాహం 

Published Mon, Jun 14 2021 11:18 AM

Marriage Of Physically Challenged Couples Held In Karnataka - Sakshi

సాక్షి, చెళ్లకెరె రూరల్‌(కర్ణాటక) : వినికిడి లోపంతో పాటు మాటలు రాని ఓ జంట ఆదివారం వివాహం ద్వారా ఒక్కటయ్యారు. తాలూకాలోని సిద్దా పుర గ్రామానికి చెందిన మంగళమ్మ, మంజునాథ్‌ దంపతుల కుమార్తె సౌమ్య, దావణగెరెకు చెందిన యమునమ్మ మంజణ్ణ దంపతుల కుమారుడు పరశురామలు పెద్దల సమక్షంలో ఒక్కటవ్వానుకున్నారు . 

ఈ క్రమంలో,  ఆదివారం కరోనా నిబంధనలు పాటిస్తూ వివాహం చేసుకున్నారు. వీరికి మాటలు రావు, వినపడవు. నూతన దంపతులను పెద్దవాళ్లందరు ఆశీర్వదించారు. ఒకరి మనసును మరొకరు తెలుసుకుని అన్యోన్యంగా ఉండాలని పెద్దవాళ్లు ఆశీర్వదించారు.   వీరి పెళ్లి పలువురికి ఆదర్శంగా నిలిచింది.   

చదవండి: Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర..

Advertisement

తప్పక చదవండి

Advertisement