నటి త్విషా శర్మ కేసులో కీలక పరిణామం.. తర్వాత ఏం జరగబోతోంది? | Major Breakthrough in the Twisha Sharma Investigation | Sakshi
Sakshi News home page

నటి త్విషా శర్మ కేసులో కీలక పరిణామం.. తర్వాత ఏం జరగబోతోంది?

Jul 12 2026 10:09 AM | Updated on Jul 12 2026 11:21 AM

 Major Breakthrough in the Twisha Sharma Investigation

ఇండోర్: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో సరికొత్త మలుపు చోటు చేసుకుంది. త్విషా శర్మది ఆత్మహత్య కాదని, ఆమెను దారుణంగా హత్య చేశారని నిర్ధారించేలా బలమైన శాస్త్రీయ ఆధారాలు లభ్యమయ్యాయి  

ఆమె శరీరంపై ఉన్న గాయాల గుర్తులు జిమ్ బెల్ట్ వల్ల ఏర్పడినట్లు ఢిల్లీ ఎయిమ్స్  వైద్య నిపుణుల బృందం తేల్చింది . ఈ మేరకు సిద్ధం చేసిన 11 పేజీల సుదీర్ఘ నివేదికను ఎయిమ్స్ అధికారులు అత్యంత రహస్యంగా  కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అందజేశారు. 

సుప్రీంకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టుల ప్రత్యేక ఆదేశాల మేరకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని నిపుణుల బృందం త్విషా శర్మ చర్మ కణజాలాలను సేకరించి అత్యాధునిక హిస్టోపాథాలజీ పరీక్షలు నిర్వహించింది .

ఈ శాస్త్రీయ పరీక్షల్లో  ట్విషా శర్మ  మెడ, శరీరంపై ఉన్న లోతైన గాయాలు, ఆమెను లొంగదీసుకుని ఉరి బిగించేందుకు జిమ్నాస్టిక్ లేదా జిమ్ బెల్టును క్రూరంగా ఉపయోగించడం వల్లే సంభవించాయని వెల్లడైంది ఈ మృతికి గల ఖచ్చితమైన కారణాలను, అంతర్గత గాయాలను విశ్లేషించడానికి మెడికల్ బోర్డు నెల రోజుల పాటు జాతీయ, అంతర్జాతీయ వైద్య జర్నల్స్, ఫోరెన్సిక్ శాస్త్రీయ పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించింది

కోర్టు ఆదేశాల ప్రకారం నివేదికలోని పూర్తి వివరాలను బహిర్గతం చేయడానికి డాక్టర్ సుధీర్ గుప్తా నిరాకరించారు  ఈ ఎయిమ్స్ నివేదిక ఆధారంగా ఇకపై సీబీఐ దర్యాప్తు జరిపి త్వరలోనే అసలు నిజానిజాలను, నిందితులను చట్టం ముందు నిలబెట్టనుందని ఆయన పేర్కొన్నారు  

నటి ట్విషా శర్మకు వివాహమైన కేవలం 5 నెలలకే, గత మే 12న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గల తన అత్తగారి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ట్విషా భర్త సమర్థ్ సింగ్ తల్లి గిరిబాలా సింగ్ ఒక విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కావడంతో, స్థానిక పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని, దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని త్విషా తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు  

స్థానిక పోలీసుల తీరుపై నమ్మకం లేకపోవడంతో వారు న్యాయం కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాధితుల అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, ఈ కేసు దర్యాప్తును తక్షణమే సీబీఐకి బదిలీ చేయడమే కాకుండా, ఎయిమ్స్ చేత ఫోరెన్సిక్ రీ-ఎగ్జామినేషన్ చేయించాలని ఆదేశించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఎయిమ్స్ నివేదికతో ఈ కేసులో అత్తగారి కుటుంబ సభ్యుల చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement