ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు | Madhya Pradesh announces 35 percent reservation for women in govt jobs | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు

Oct 6 2023 5:48 AM | Updated on Oct 6 2023 5:48 AM

Madhya Pradesh announces 35 percent reservation for women in govt jobs - Sakshi

భోపాల్‌: అటవీ శాఖ మినహా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ సివిల్‌ సరీ్వసెస్‌(స్పెషల్‌ ప్రొవిజన్‌ ఫర్‌ అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌) రూల్స్‌–1997కు సవరణ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇకపై మహిళలకు 35 శాతం కోటా అమలవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పోలీసు శాఖతోపాటు ఇతర ప్రభుత్వ పోస్టుల్లో 35 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు టీచర్ల పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఇటీవల ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement