కోడిని వేటాడుతూ ఇంట్లోకి.. ముగ్గురిపై చిరుత దాడి | Leopard Enters House Attacked 3 Members Tamil Nadu Vellore | Sakshi
Sakshi News home page

కోడిని వేటాడుతూ ఇంట్లోకి.. ముగ్గురిపై చిరుత దాడి

Apr 15 2021 10:35 AM | Updated on Apr 15 2021 12:32 PM

Leopard Enters House Attacked 3 Members Tamil Nadu Vellore - Sakshi

సాక్షి, చెన్నై: ఓ ఇంట్లోకి చొరబడి ముగ్గురు వ్యక్తులపై చిరుత దాడి చేసింది. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని కలైపాలయం ఎర్థంగాళ్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. వేలాయుధం, అతని భార్య ప్రేమ, మరో వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చిరుత అర్థరాత్రి వారింట్లో ప్రవేశించింది. కోడిని వేటాడుతూ అటువైపుగా వచ్చి ఇంట్లో ఇరుక్కుపోయింది.

ఇంతలో మనుషుల అలికిడి వినబడటంతో వారిపై దాడి చేసింది. కాగా క్షతగాత్రులు ప్రస్తుతం గుడియాత్తం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇంట్లో బంధించిన చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులు వీరికి సహకరిస్తున్నారు.

చదవండి: పెళ్లైన ఆర్నెళ్లకే గొడవలు; విరక్తి చెంది భర్తపై..

Advertisement
 
Advertisement
Advertisement