సీబీఐ ఇంటరాగేషన్‌.. కవిత పిటిషన్‌పై నేడు విచారణ | Kavitha CBI Interrogation Plea At Delhi Rouse Avenue Court Updates | Sakshi
Sakshi News home page

సీబీఐ ఇంటరాగేషన్‌.. కవిత పిటిషన్‌పై నేడు విచారణ

Apr 10 2024 10:54 AM | Updated on Apr 10 2024 10:54 AM

Kavitha CBI Interrogation Plea At Delhi Rouse Avenue Court Updates - Sakshi

శనివారం తీహార్‌ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. 

ఢిల్లీ, సాక్షి: లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన తనను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ సంస్థ ఇంటరాగేషన్‌ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. 

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్‌ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్‌ 5వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని  కవిత తరఫు న్యాయవాది నితీష్‌ రాణా కోర్టులో మెన్షన్‌ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో.. గడువు ఇస్తూ పిటిషన్‌పై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే.. లిక్కర్‌ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నారు. జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తీహార్‌ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే.. శనివారం తీహార్‌ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement