కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా | Kavitha Bail Petition Hearing In Supreme Court Today | Sakshi
Sakshi News home page

కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

Aug 20 2024 10:00 AM | Updated on Aug 20 2024 1:25 PM

Kavitha Bail Petition Hearing In Supreme Court Today

ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా కవిత బెయిల్‌ పిటిషన్‌కు సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయగా. ఈడీ దాఖలు చేయలేదు. దీంతో.. శుక్రవారం లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం.

ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కవితకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. 

దీంతో.. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్‌ 20కి వాయిదా వేసింది. దీంతో ఇవాళ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

కవితకు మళ్లీ నిరాశే!

మరోవైపు కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ,ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు..ఈడీ కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో విచారణను వాయిదా వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement